జింకలను సల్మానే చంపాడు: డ్రైవర్

28 Jul, 2016 03:45 IST|Sakshi
జింకలను సల్మానే చంపాడు: డ్రైవర్

న్యూఢిల్లీ :  నటుడు సల్మాన్ ఖాన్‌ను 1998 నాటి కృష్ణజింకల కేసులో రాజస్తాన్ హైకోర్టు తాజాగా నిర్దోషిగా ప్రకటించినా.. జింకలను చంపింది సల్మానేనని ఆనాడు జీపు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెబుతున్నాడు. కేసు తొలినాళ్లలో వాంగ్మూలమిచ్చిన హరీష్..‘సల్మాన్ జీపు దిగి, కృష్ణజింకలను వేటాడి చంపాడు’ అని అప్పట్లో చెప్పాడు.

2002 నుంచి హరీష్ కనిపించకుండా పోయాడు. తాజాగా మీడియా ముందుకొచ్చి ‘నా మాటకు కట్టుబడి ఉన్నా. సల్మానే జింకలను చంపాడు’ అని చెప్పాడు. తనకు రక్షణ కల్పించి ఉంటే కోర్టులో సాక్ష్యం చెప్పిఉండే వాడినన్నాడు.

మరిన్ని వార్తలు