మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్‌ : సానియా మీర్జా

16 Aug, 2019 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘‘ మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్‌. చాలా సరదాగా సాగింది’’ అంటూ ప్రముఖ హైదరాబాదీ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడితో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ లేజీగా సాగిన ఓ 5 కిలోమీటర్ల ప్రయాణం ’’ అని ఆమె పేర్కొన్నారు.  కాగా గతేడాది అక్టోబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన క్రీడా దంపతులు సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ అతడికి ఇజహాన్‌ మీర్జా మాలిక్‌ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కుమారుడికి సంబంధించిన ఫొటోలను సానియా తరచుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటారు.

Our first trek together ... that was fun 👼🏽🤱🏽#Izzy #5km #mummahustles

A post shared by Sania Mirza (@mirzasaniar) on

మరిన్ని వార్తలు