న్యూఢిల్లీ : ‘‘ మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్. చాలా సరదాగా సాగింది’’ అంటూ ప్రముఖ హైదరాబాదీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడితో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘‘ లేజీగా సాగిన ఓ 5 కిలోమీటర్ల ప్రయాణం ’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా గతేడాది అక్టోబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన క్రీడా దంపతులు సానియా మీర్జా- షోయబ్ మాలిక్ అతడికి ఇజహాన్ మీర్జా మాలిక్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కుమారుడికి సంబంధించిన ఫొటోలను సానియా తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.