మోసపోయిన మన్మోహన్ మాజీ సలహాదారు

29 Jun, 2020 11:30 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్​కు మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్‌ బారు ఆన్​లైన్ మోసానికి గురయ్యారు. మద్యం పేరుతో ఓ వ్యక్తి తన నుంచి 24 వేల రూపాయలు తీసుకుని మోసం చేశారన్న ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు.

లాక్​డౌన్​ కాలంలో సంజయ్‌ బారు మద్యం కోసం ఆన్​లైన్​లో వెతికారు. ఆయనకు లా కేవ్ వైన్స్ అండ్​ స్పిరిట్స్ అనే షాపు మద్యం సరఫరా చేస్తున్నట్లు కనిపించింది. అందుబాటులో ఉన్న మొబైల్​ నంబర్​ కు ఫోన్ చేయగా, సదరు వ్యక్తి 24 వేల రూపాయలు ఆన్​లైన్​లో పంపాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంపిన సంజయ్‌ బారు, మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు.(‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’)

మొబైల్​ నెంబరు ట్రేస్ చేసిన పోలీసులకు నిందితుడు ఓ క్యాబ్​ డ్రైవర్​ అని తెలిసింది. అతన్ని అరెస్టు చేసి విచారించగా వాళ్లు ఓ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు. పలు రకాల సిమ్​ కార్డులు, నకిలీ పేర్లు, అడ్రెస్సులు వాడుతూ టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తామని తెలిపాడు. (బైక్‌పై చీఫ్‌ జస్టిస్ చక్కర్లు; ఫోటోలు వైరల్‌)

తమకు వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకు అకౌంట్లు కూడా ఉన్నాయని నిందితుడు వెల్లడించాడు. బాధితులు ట్రాన్స్​ఫర్ చేసిన ఐదు నుంచి పది నిమిషాల్లో డబ్బు వేరే రాష్ట్రాల్లోని అకౌంట్లకు అక్కడి నుంచి అసలు ఖాతాలకు బదిలీ అవుతుందని వివరించాడు. పోలీసులకు అంతుచిక్కకుండా ఉండేందుకు రకరకాల ప్లాన్స్ గీస్తామని చెప్పాడు.

>
మరిన్ని వార్తలు