అక్టోబర్ 5 తేది నుంచి సత్యమేవ జయతే!

14 Sep, 2014 22:22 IST|Sakshi
అక్టోబర్ 5 తేది నుంచి సత్యమేవ జయతే!
ముంబై: దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన టెలివిజన్ షో 'సత్యమేవ జయతే' వచ్చేనెల ఆరంభం కానునందని ట్విటర్ లో తెలిపారు. మూడవ వెర్షన్ సత్యమేవ జయతే కార్యక్రమ ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. 
 
సత్యమేవ జయతే అక్టోబర్ 5 తేది నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ప్రోమోను చూడండి. మీ స్పందనను తెలియచేయండి అంటూ అమీర్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, కంగనా రనౌత్ లు కనిపించనున్నారు. 
మరిన్ని వార్తలు