అయోధ్యపై 4న సుప్రీంలో విచారణ

25 Dec, 2018 03:56 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య అంశం జనవరి 4వ తేదీన సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం ఈ అంశంలో దాఖలైన పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాద ప్రాంతంపై దాఖలైన 14 పిటిషన్లపై విచారణ తేదీలను ఈ ధర్మాసనం ఖరారు చేయనుంది. వివాదాస్పద ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఆధార్‌ తీర్పుపై రివ్యూ పిటిషన్‌
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్‌ చట్టం చెల్లుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఇంతియాజ్‌ అలీ పల్సనియా అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. పౌరుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అందించే సాధనంగా ఆధార్‌ చట్టం మారిపోయిందని పిటిషనర్‌ కోర్టుకు చెప్పారు.

మరిన్ని వార్తలు