ఆధార్‌–మొబైల్‌ అనుసంధానమెందుకు?

26 Apr, 2018 03:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ని తప్పనిసరిగా అనుసంధానించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. మొబైల్‌ వినియోగదారుల గుర్తింపును తప్పనిసరిగా ధ్రువీకరించాలని గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ఆయుధంగా వాడుకుని, ఆధార్‌ అనుసంధానతను తెరపైకి తెచ్చారంది. ఆధార్‌ చట్టబద్ధతపై కొనసాగుతున్న విచారణలో భాగంగా బుధవారం సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఆధార్‌–మొబైల్‌ తప్పనిసరి అనుసంధానంపై తామేమీ ఆదేశించలేదని స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు