బాలుడి కిడ్నాప్.. రూ.2 కోట్లు డిమాండ్

2 Dec, 2015 08:25 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ స్కూల్లో కిడ్నాప్ కలకలం రేపింది. 13 ఏళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి ఏకంగా రూ.రెండు కోట్లు డిమాండ్ చేశారు. అయితే, ఆ విద్యార్థిని స్కూల్లోనే కిడ్నాపర్లు బంధించడం గమనార్హం.

అటు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, బంధువులు పోలీసులను కంగారు పెట్టించిన ఈ ఘటన చివరకు సుఖాంతంగా ముగిసింది. కిడ్నాపర్ల ఆటకట్టించి విద్యార్థిని పోలీసులు వారి చెరనుంచి విడిపించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో స్వల్పంగా కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు