పాఠశాలల్లో జైహింద్‌, జై భారత్‌ అనాల్సిందే...

1 Jan, 2019 11:39 IST|Sakshi

గాంధీనగర్‌: ప్రాథమిక పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో హాజరుపలికేముందు ఎస్‌ సర్‌, ప్రజెంట్‌ సర్‌కు బదులుగా జైహింద్‌, జై భారత్‌ అనాలని నిర్ణయించింది. నూతన సంవత్సరం జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈవిధానం అమలు కానుంది. ఈమేరకు గుజరాత్ విద్యాశాఖమంత్రి భూపేంద్ర సిన్హ్ చూడాసమా ప్రకటించారు. విద్యార్థి దశనుంచే పిల్లల్లో దేశభక్తిని అలవరిచేందుకు హాజరు నిబందనల్లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు