టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి

7 Feb, 2018 11:10 IST|Sakshi
టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

హర్యానా : టోల్ ప్లాజా సిబ్బందిపై బస్సు డ్రైవర్, కండక్టర్ లు దాడికి దిగారు. గురుగ్రామ్-ఫరీదాబాద్‌ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సిబ్బందిపై హర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, కండక్టర్లు దాడి చేసిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరూ కలిసి టోల్‌ప్లాజా సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు