మోడీ, జీ పర్యటనకు భారీ భద్రత

13 Sep, 2014 12:44 IST|Sakshi

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ గుజరాత్ పర్యటనకు అసాధారణ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా బలగాలతో సహా మూడు వేలమందికి పైగా భద్రత సిబ్బందిని మోహరించనున్నారు.

వచ్చే వారం మోడీ, జీ గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విమానాశ్రయం సహా వారు ప్రయాణించే మార్గాలు, వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సివిల్, యూనిఫామ్ దుస్తుల్లో భద్రత బలగాలను మోహరించనున్నారు.

మరిన్ని వార్తలు