యువతి ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి

2 Jun, 2016 13:23 IST|Sakshi
యువతి ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి

బెంగళూరు: సెల్ఫీ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లతో స్వీయచిత్రాలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎగబాకుతోంది. తాజాగా రాజస్థాన్ కు చెందిన లా స్టూడెంట్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానికి గురై మృతి చెందింది.

జోధ్పూర్ నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్న ప్రణీత మెహతా(21) అనే విద్యార్థిని తన స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్ కు వచ్చింది. గోకర్ణ బీచ్ లో 300 అడుగుల లైట్ హౌస్ పైకిఎక్కి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి పడిపోయింది. అక్కడే ఉన్న జాలర్లు ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత ఆమె మృతదేహాన్ని సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చారు.

ముంబై, గోవా వెళ్లొచ్చిన తర్వాత ప్రణీత, ఆమె స్నేహితులు ఇక్కడకు వచ్చారు. ప్రపంచంలో అత్యధికంగా సెల్ఫీ మరణాలు ఇండియాలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2015లో 27 సెల్ఫీ మరణాలు సంభవించాయి.

మరిన్ని వార్తలు