తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మి లక్షలిస్తే..

25 Aug, 2016 11:04 IST|Sakshi

ముంబయి: తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మి మహిళ ఓ నిత్య పెళ్లికొడుక్కి రూ.9లక్షలు ఇచ్చి మోస పోయింది. దఫాల వారిగా ఆమె నుంచి డబ్బు పుచ్చుకున్న ఆ మాయల మరాఠీ అనంతరం కనిపించకుండా పోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని మనోహర్ వినాయక్ నంగారే(50) అనే వ్యక్తి ముంబయి, థానే, నాశిక్, ఔరంగాబాద్, అహ్మదానగర్ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్నాడు.

అనంతరం వారికి ముఖం చాటేశాడు. ఆ తర్వాత కోలాపూర్ ప్రాంతంలో మరో పెళ్లి కోసం డిసెంబర్ 2015లో ప్రకటన ఇవ్వగా ఓ మహిళ స్పందించింది. అనంతరం వారిద్దరి మధ్య పరిచయాలు పెరిగాయి. ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. ఈ సమయంలో తాను ఒక పెట్రోల్ బంక్ పెట్టాలని అనుకుంటున్నానని, రూ.12లక్షలు అవసరం ఉన్నాయని చెప్పాడు. దీంతో ఆమె దఫాల వారిగా రూ.9లక్షలు చెల్లించింది. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు అతగాడి అసలు విషయం బయటపడింది అతడొక నిత్య పెళ్లి కొడుకు అని. థానేలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు