భదోహిలో ఘోర ప్రమాదం

25 Jul, 2016 10:31 IST|Sakshi
భదోహిలో ఘోర ప్రమాదం

వ్యాన్ ను ఢీకొన్న రైలు
ఏడుగురు చిన్నారుల మృతి


భదోహి: ఉత్తరప్రదేశ్ లోని భదోహిలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యాన్ ను రైలు ఢీకొననడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాపలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యాన్ లో 19 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం.

పలువురు చిన్నారులు కూడా గాయపడినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు