చెరువులోకి దూసుకెళ్లిన కారు : ఏడుగురు మృతి

28 Jan, 2018 12:56 IST|Sakshi

అలీగఢ్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన అలీగఢ్‌లోని చెర్రా రోడ్డు సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులతో పాటూ మరో ఐదుగురు మృతిచెందారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు