శశి థరూర్‌కు సాధారణ బెయిలు

8 Jul, 2018 02:20 IST|Sakshi
శశి థరూర్‌,సునంద పుష్కర్‌

న్యూఢిల్లీ: భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో ఢిల్లీలోని ఓ కోర్టు కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌కు శనివారం సాధారణ బెయిలు మంజూరు చేసింది.  ఓ సెషన్స్‌ కోర్టు జూలై 5నే తనకు ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయాన్ని థరూర్‌ కోర్టుకు తెలియజేశారు. తర్వాత జడ్జి ముందస్తు బెయిలును సాధారణ బెయిలుగా మారుస్తూ లక్ష రూపాయల బాండు, రూ.లక్ష ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించారు. సునంద 2014లో ఢిల్లీలోని ఓ హోటల్‌లో మృతి చెందారు.

మరిన్ని వార్తలు