ముంబై : లాక్డౌన్ నిబంధనల సడలింపులపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శవయాత్రలో అయితే కేవలం 20 మందికి అనుమతి ఇచ్చి, మద్యం షాపుల ఎదుట మాత్రం వేలమందికి అనుమతి ఇవ్వడంపై తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు.
శవయాత్రలో 20 మందిని మాత్రమే అనుమతించారు, ఎందుకంటే ఆత్మ(స్పిరిట్) అప్పటికే శరీరాన్ని వదిలి వెళ్లి ఉంటుంది. అదే మద్యం షాపుల ముందు మాత్రం వేలాది మందికి అనుమతిచ్చారు. ఎందుకంటే మద్యం షాపుల్లోనే స్పిరిట్ ఉంటుంది కాబట్టి అని ట్విటర్లో పోస్ట్ చేశారు.
Only 20 people allowed to gather for a funeral -
because the spirit has already left the body.1000's allowed to gather near an alcohol shop,
— Sanjay Raut (@rautsanjay61) May 8, 2020
because the shops have spirits in them.