నచ్చిన సీటుకోసం 2000 మందికి నరకం

14 Apr, 2016 15:57 IST|Sakshi
నచ్చిన సీటుకోసం 2000 మందికి నరకం

ముంబయి: తనకు నచ్చిన చోట సీటు ఇవ్వాలంటూ శివసేన పార్టీ ఎమ్మెల్యే అతడి అనుచరులు నానా రచ్చ చేశారు. చత్రపతి శివాజీ టర్మినస్ పై దాదాపు గంటసేపు ఎక్స్ ప్రెస్ రైలును ముందుకెళ్లకుండా అడ్డుకున్నాడు.

దీంతో దాదాపు 2000 మంది ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినట్లయింది. నాందేడ్ ప్రాంతానికి చెందిన హేమంత్ పాటిల్ అనే ఎమ్మెల్యే దేవగిరి ఎక్స్ ప్రెస్ లో తనకు సెకండ్ ఏసీ కోచ్ లో పక్క సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి పదిగంటల వరకు రైలు కదలకుండా అడ్డుకున్నారు.

>
మరిన్ని వార్తలు