శివకుమార్‌ కస్టడీ పొడిగించిన కోర్టు

18 Sep, 2019 02:21 IST|Sakshi

సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే డీకే శివకుమార్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మరో 14 రోజులపాటు న్యాయస్థానం పొడిగించింది. శివకుమార్‌ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున జుడిషియల్‌ కస్టడీకి పంపాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. దీనిపై మంగళవారం వాదోపవాదాలు విన్న అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు