'టెర్రరిస్టులకు ఎవరు మద్దతిచ్చినా శిక్షించాల్సిందే'

25 Feb, 2016 12:07 IST|Sakshi

న్యూఢిల్లీ : టెర్రరిస్టులకు ఎవరు మద్దతు ఇచ్చినా వారిని శిక్షించాల్సిందే అని సీపీఐ పాలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.   కానీ నిర్ధోషులను మాత్రం వేధించవద్దు అని ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. గురువారం న్యూఢిల్లీలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ..  దేశభక్తి గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ ప్రభుత్వానికి చురక అంటించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే రాజద్రోహులా అని కేంద్రప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఏచూరి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు