సెంట్రల్‌ వర్సిటీల్లో యోగా శాఖలు

3 Apr, 2018 08:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా యోగా డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ నిర్ణయించింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హెచ్‌ఆర్‌డీ శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ మంగళవారం ఈ విషయం చెప్పారు.

ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ,  హేమ్‌వతి నందన్‌ బహుగుణ గర్వాల్‌ యూనివర్సిటీ, విశ్వభారతి, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్, మణిపూర్‌ యూనివర్సిటీల్లో కొత్తగా యోగా శాఖలను ఏర్పాటుచేయనున్నారు. ఈ వర్సిటీల్లో యోగా శాఖల ఏర్పాటుకు యూజీసీ ఇప్పటికే అనుమతినిచ్చిందని సత్యపాల్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు