ఆరుగురు సజీవ సమాధి

15 Aug, 2015 12:22 IST|Sakshi

లుథియానా:  దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో  మునిగి తేలుతోంటే పంజాబ్లోని  ఓ కుటుంబం మాత్రం సజీవ సమాధి అయింది.   అర్థరాత్రి ఓ వాహనం పటియాలాలోని కుటుంబం  ముంగిట  మృత్యుఘంటికలు మోగించింది.   దీంతో నలుగురు చిన్నారులు సహా దంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.

వివరాల్లోకి వెళితే...నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి ఇసుకలోడ్తో వెళుతున్న ఓ టిప్పర్ వాహనం అదుపు తప్పి  పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.  దీంతో గుడిసెలో నిద్రిస్తున్న రాజు(32) భార్య మాన్సి(30)  నలుగురు పిల్లలు  ఖుషి(1) షీతల్ (3) నిహాల్(5) అశు(10) ఆ ఇసుక కింద  కూరుకుపోయారు. పోలీసులు సంఘటనా  స్థలానికి  చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే  చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు.   పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు