'కొన్ని రద్దు, కొన్ని మళ్లింపు'

3 Dec, 2015 14:31 IST|Sakshi

చెన్నై వరదల కారణంగా.. చెన్నై మీదుగా వెళ్ల వలసిన కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రద్దైన రైళ్లలో చెన్నై సెంట్రల్- హౌరా కోరమండల్ ఎక్స్ ప్రెస్, చెన్నై - అహ్మదాబాద్ నవజీవన ఎక్స్ ప్రెస్, చెన్నై - తిరుపతి ఎక్స్ ప్రెస్, విశాఖ - సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, తిరుపతి - చెన్నై ఎక్స్ ప్రెస్, గౌహతి - చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వరదల కారణంగా భారీ ఎత్తున రైల్వే ట్రాక్ పై నీళ్లు వచ్చి చేరడంతో అధికారులు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.



 

మరిన్ని వార్తలు