తన భార్యను వేధిస్తున్నాడని..

26 Sep, 2016 19:26 IST|Sakshi
తన భార్యను వేధిస్తున్నాడని..

కాన్పూర్: తన భార్యను వేధిస్తున్నాడని తండ్రిపై కొడుకు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లాలో కలకలం రేపింది. శంషాబాద్ పోలీసు స్టేషన్ లోని పరిధిలోని ఇదంపూర్ తామరాయ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిరంతరం తన భార్యను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆగ్రహంతో అమిత్(28) తన తండ్రి రతిరామ్(50)పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో కోడలి పట్ల రతిరామ్ అసభ్యంగా ప్రవర్తించడంతో అమిత్ నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రతిరామ్ ను ఖయామ్ గంజ్ కమ్యునిటీ ఆస్పత్రికి తరలించారు. తర్వాత అతడిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అమిత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమిత్ తమ్ముడు అనుజ్ ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అమిత్ ను జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు