పీసీసీ అధ్యక్షులతో 13న సోనియా భేటీ

9 Jul, 2013 13:20 IST|Sakshi
పీసీసీ అధ్యక్షులతో 13న సోనియా భేటీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల 13న సీఎల్పీ నాయకులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఆహార భద్రత బిల్లుపై వీరితో చర్చించనున్నారు.

దేశంలోని మూడింట రెండు వంతుల మందికి సబ్సిడీపై తిండిగింజలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ భారీ పథకాన్ని అమలు చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ సంతకం కూడా చేశారు. మరో ఆరు నెలల్లో ఈ పథకం అమల్లోకి రానుంది.

మరోవైపు ఆహారభద్రత బిల్లుపై పార్లమెంటులో చర్చకు సిద్ధపడకుండా హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దీన్ని రాజకీయ జిమ్మిక్కుగా వర్ణించాయి. గత తొమ్మిదేళ్లుగా ఈ బిల్లును తొక్కిపెట్టి, పార్లమెంట్ లో చర్చకు రాకుండా చేసి ఇప్పుడు హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు