ఆదివారం సోనియా ఇఫ్తార్ విందు!

23 Jul, 2014 20:35 IST|Sakshi
ఆదివారం సోనియా ఇఫ్తార్ విందు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నారు. పలు విషాద సంఘటనల కారణంగా కొద్ది సంవత్పరాలుగా సోనియా ఇఫ్తార్ విందుకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం తరపున అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. 
 
అయితే ఈ సంవత్సరం ఇఫ్తార్ విందును నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో సోనియా ఆదివారం ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు