2 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు

3 Jun, 2015 16:37 IST|Sakshi
2 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని తెలియజేసింది.

విదర్భా నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆవర్తన ప్రభావం వల్ల కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలియజేసింది.

మరిన్ని వార్తలు