అఖిలేశ్ కు మేలు చేసిన పరి'వార్'

28 Oct, 2016 20:13 IST|Sakshi
అఖిలేశ్ కు మేలు చేసిన పరి'వార్'

న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీలో ముసలం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు మేలు జరిగిందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. సమాజ్ వాదీలో వివాదం తర్వాత అఖిలేశ్ కు ఆదరణ మరింత పెరిగిందని సీ-ఓటర్ సర్వేలో వెల్లడైంది. గత నెల రోజుల కాలంలో అఖిలేశ్ కు ప్రజాదరణ బాగా పెరిగిందని సర్వే తెలిపింది. సెప్టెంబర్, అక్టోబర్ లో రెండుసార్లు సీ-ఓటర్ సర్వే నిర్వహించింది. రెండో సర్వేలో శివపాల్, ములాయం కంటే అఖిలేశ్ పైచేయి సాధించినట్టు గణాంకాలను బట్టి వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ లోని 403 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు.

ములాయం కంటే అఖిలేశ్ వైపే ఎక్కువమంది మొగ్గుచూపడం విశేషం. అఖిలేశ్ కు శివపాల్ ఏవిధంగానూ పోటీ కాలేరని ఓటర్లు అభిప్రాయపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ 'గుండారాజ్' ఇమేజ్ ను మార్చేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారని సర్వేలో 68 శాతం మంది పేర్కొన్నారు. బాబాయ్-అబ్బాయ్ మధ్య నెలకొన్న విభేదాలు వీధికెక్కడంతో సమాజ్ వాదీ పార్టీలో ముసలం రేగింది. చివరకు 'పెద్దాయన' జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినట్టు కనబడుతున్నా రెండు వర్గాలు పరోక్షంగా కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు