ఘర్షణల్లో చూపు కోల్పోయిన కలెక్టర్, నేత్రదానానికి సిద్దమైన ఓ నేత!

7 Jul, 2014 09:55 IST|Sakshi
లక్నో: హింసాత్మక ఘర్షణల్లో కళ్లు కోల్పోయిన ఓ జిల్లా కలెక్టర్ కు సమాజ్ వాదీ పార్టీ నేత నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని కాంత్ ఏరియాలో జరిగిన హింసాత్మక సంఘటనలో మొరాదాబాద్ జిల్లా కలెక్టర్ కళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. 
 
నేత్ర, రక్త దానం కంటే మించినది ఈ ప్రపంచంలో ఏమిలేవు. చంద్రకాంత్ లాంటి నిజాయితీపరుడైన అధికారికి నా కళ్లు చూపు తీసుకువస్తే అంతకంటే గొప్ప గౌరవం తనకేముంటుంది అని ఎస్పీ నేత అమిత్ జానీ అన్నారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు. 
 
ఓ ఆలయంలో లౌడ్ స్పీకర్ తొలగింపు వ్యవహారంలో కాంత్ ఏరియాలో జూలై 4 తేదిన జరిగిన హింసాత్మక సంఘటనలో చంద్రకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చంద్రకాంత్ కు చికిత్స జరుగుతోంది. చంద్రకాంత్ కు కళ్లు దానం చేయడానికి ముందుకు వచ్చిన అమిత్ జానీపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
మరిన్ని వార్తలు