రిటైర్డ్ ఎస్పీ దంపతుల ఆత్మహత్య?

30 Jan, 2016 16:46 IST|Sakshi

చెన్నై:  తమిళనాడులోని తిరునవ్వేలిలో మాజీ ఎస్పీ  మరియప్పన్ (66), ఆయన భార్య సుందరి  అనుమానాస్పద  స్థితిలో  మృతి చెందారు. పలాయం కొట్టాయంలోని తమ నివాసంలో వారు చనిపోయి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు  పోలీసులకు సమాచారం అందించారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియప్పన్ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని  ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  చెన్నైలో ఉంటున్న వారి కుమార్తెకు, ఇతర బంధువులకు సమాచారం అందించారు. జర్మనీలో ఉంటున్న వారి కొడుకు ఈ మధ్యనే  చెన్నై వచ్చినట్టు సమాచారం.
 

>
మరిన్ని వార్తలు