షాపింగ్కు వెళ్లొస్తుండగా షాకింగ్ ఘటన

8 Nov, 2016 15:34 IST|Sakshi
షాపింగ్కు వెళ్లొస్తుండగా షాకింగ్ ఘటన

అహ్మదాబాద్: కూతురును, మనవరాలిని చూసేందుకు వచ్చిన ఓ పెద్దావిడ మృత్యువాత పడింది. మనవరాలితో కలిసి రోడ్డు దాటుతున్న ఆమెను వాయువేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయింది. మనవరాలు మాత్రం గాయపడింది. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో శనివారం చోటుచేసుకోగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 63 ఏళ్ల జైనీత్ థామస్ అనే వృద్ధురాలు ముంబయి నుంచి తన కూతురును చూసేందుకు అహ్మదాబాద్ వచ్చింది. శనివారం మద్యాహ్నం తన మనవరాలు ప్రిషా(15)తో కలిసి షాపింగ్ కు వెళ్లింది. అనంతరం రద్దీగా ఉన్న జాతీయ రహదారిని దాటుతుండగా ఒక్కసారిగా మితిమీరిన వేగంతో వచ్చిన హ్యుందాయ్ ఐ20 కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్థురాలు థామస్ చనిపోగా మనవరాలు మాత్రం గాయాలతో బయటపడింది. అయితే, ఢీకొట్టిన కారు, డ్రైవర్ వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు