'చలామణిలో 60 వేల కోట్లు'

6 Apr, 2016 19:51 IST|Sakshi
'చలామణిలో 60 వేల కోట్లు'

ముంబై: ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల పంపకం విపరీతంగా పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ రఘరాం రాజన్ అన్నారు. సుమారు రూ.60 వేల కోట్లు చలామణిలో ఉందని చెప్పారు. మంగళవారం ద్రవ్య, పరపతి విధాన సమీక్ష ప్రకటన తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడారు.

‘ఎన్నికల సమయంలో ప్రజల వద్ద డబ్బుల గలగల ఎక్కువగా ఉంటుంది. ఎందుకో మీకూ తెలుసు.. నాకు తెలుసు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు