వైరస్‌ లక్షణాలు వేర్వేరుగా..

14 May, 2020 15:55 IST|Sakshi

శరీర భాగాలన్నింటిలో ఇన్ఫెక్షన్‌

న్యూయార్క్‌ : కరోనా మహమ్మారి మానవ శరీరంలో ఊపిరితిత్తులు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, పేగులు సహా అన్ని కీలక అవయవాలను ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఊపిరితిత్తులే కాకుండా అన్ని అవయవాలపై వైరస్‌ దాడి చేస్తుందని దీంతో కోవిడ్‌-19 లక్షణాలు సైతం బహుముఖంగా ఉంటాయని రెండు వేర్వేరు నివేదికలు వెల్లడించాయి. కరోనా రోగుల్లో లక్షణాలపై ఈ అథ్యయన వివరాలు స్పష్టతను తీసుకువచ్చాయి. మహమ్మారి దాడితో యువతలో  స్ట్రోక్‌కు దారితీసేలా బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడం, విపరీతమైన తలనొప్పి, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర లక్షణాలు కపిపిస్తాయని వెల్లడించింది. 

శ్వాసకోశ వైరస్‌గా పేరొందిన కోవిడ్‌-19 రోగి నోటి నుంచి వెలువడే తుంపరల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కొన్ని సార్లు డయేరియాకు దారితీయడంతో పాటు పేగు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందుల వంటి ఇతర లక్షణాలతోనూ కూడి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. రోగుల మలంలోనూ వైరస్‌ జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్‌-కోవిడ్‌-2 వాహకంగా  జీర్ణవ్యవస్థ మారవచ్చని నేచర్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన జీఝూ, యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం పేర్కొంది. ఇక​ మానవ శరీరంలోని కీలక అవయవాలన్నింటిలో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించామని న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన మరో అథ్యయనం వెల్లడించింది.

చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఆ ఛాన్స్‌

మరిన్ని వార్తలు