న్యూఢిల్లీ: జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి స్తుతి నరేన్ కాకర్ నియమితులయ్యారు. దాదాపు ఏడాదిగా బాలల హక్కుల కమిషన్కు చైర్మన్ లేకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... స్తుతి నారాయణ్ కాకర్ను నియమిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.