పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మండిపడ్డారు. ఇప్పుడు తలెత్తిన సమస్యలకు ఆర్థికశాఖ వివరణ ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నుంచి వసూలుచేసే ఆదాయ పన్నును పూర్తిగా ఎత్తేయాలని ఆయన అన్నారు.
రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మీద చాలా దయ చూపారని, లేకపోతే తాను ఆయనపై చేసిన ఆరోపణల మీద విచారణ జరిగి ఉండేదని స్వామి వ్యాఖ్యానించారు.