‘నేతల నల్లధనం వివరాలను రాష్ట్రపతికి చెప్పా’

11 Jul, 2014 02:21 IST|Sakshi
‘నేతల నల్లధనం వివరాలను రాష్ట్రపతికి చెప్పా’

న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. దేశంలోని రాజకీయ నేతల నల్లధనానికి సంబంధించి తాను కనుగొన్న వివరాలను ఆయనకు వెల్లడించారు. తమిళనాడులో గత 2 నెలల్లో జరిగిన హిందూ సంస్థల నేతల హత్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చానని ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిన శ్రీలంక తమిళులు తమిళనాడులోకి చొరబడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకునేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరాను. ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల ఇస్లామిక్ రాజ్యం(ఖలీఫేట్)లో తమిళనాడు ముస్లింలు చేరారని తెలిపాను. వీటిని అరికట్టేందుకు రాజ్యాంగంలోని 256 అధికరణ కింద రాష్ట్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశాను’ అని వెల్లడించారు.

మరిన్ని వార్తలు