'మరిన్ని రైళ్లు ప్రవేశపెడతాం'

3 Jul, 2019 11:05 IST|Sakshi

భారత్‌లో ప్రవేశపెట్టిన 'వందేభారత్‌' సెమీ హైస్పీడ్‌  రైలు  విజయవంతం కావడంతో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది.

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రవేశపెట్టిన 'వందేభారత్‌' సెమీ హైస్పీడ్‌  రైలు  విజయవంతం కావడంతో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ తయారీ కంపెనీలతో రైళ్ల తయారీకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీహెచ్‌ఈఎల్‌, హ్యుందాయ్, చైన్నైకి చెందిన ఇంటిగ్రేట్‌డ్‌ కోచ్‌ ప్యాక్టరీ, రాయ్‌బరేలీ మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, ఆల్స్టమ్‌లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019, ఫిబ్రవరి 15 న వందేభారత్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణించే ఈ రైలును చెన్నైకి చెందిన ఇంటిగ్రేటడ్‌ కోచ్‌ ప్యాక్టరీ తయారు చేసింది. 16 కోచ్‌లు కలిగిన ఈ రైలు గంటకు 130 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. వందేభారత్‌ రైలును 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు