కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం

15 Mar, 2017 16:42 IST|Sakshi
కుప్పకూలిన సుఖోయ్‌-30 విమానం

రాజస్థాన్‌ : సుఖోయ్‌-30 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్‌ ప్రాణాలతో సురక్షితంగా తప్పించుకున్నారు. రాజస్థాన్‌ బర్మర్‌ జిల్లా శివకర్‌ కుద్లా గ్రామం వద్ద బుధవారం విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఈ విమానాన్ని ఉత్తర్‌లాయి ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో ల్యాండ్‌ చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన ధుర రామ్‌ ఆయన భార్య, మనవడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

>
మరిన్ని వార్తలు