సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ

5 Apr, 2018 02:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో మెడికల్, డెంటల్‌ కోర్సుల్లో పీజీ చేయాలనుకునేవారు రాష్ట్రంలో స్థిరనివాసం కలిగిఉండాలంటూ ప్రభుత్వం జారీచేసిన సమాచార బులెటిన్‌లోని నిబంధన చెల్లదని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ యుయు లలిత్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ నిబంధనను సవరించి బులెటిన్‌ను మళ్లీ విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, కర్ణాటక ఎగ్జామినేషన్స్‌ అథారిటీలను ఆదేశించింది. అలాగే పరీక్షల క్యాలెండర్‌ను పునఃప్రచురించాలని సూచించింది.  

మరిన్ని వార్తలు