ఢిల్లీ : హౌసింగ్ సొసైటీ కేసు పై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరణ పిటిషన్ వేసింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఉపసంహరణ పిటిషన్ను సుప్రీం కోర్టు అనుమతించలేదు.
పాలసీలో మార్పులు చేసుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది. దీనికి తెలంగాణ తరఫు న్యాయవాది అంగీకరించారు. ప్రతివాదిగా ఏపీ సర్కార్ను కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది.