ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం

12 Mar, 2018 03:18 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఓట్ల టోటలైజర్‌ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అలాంటి యంత్రాలతో పనిలేదనీ, బూత్‌ల వారీగా ఫలితాలు వెల్లడిస్తేనే అభ్యర్థులకు ఏ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఎక్కువ వచ్చాయి అనే విషయాలు తెలుస్తాయంది. తద్వారా వారు ఓట్లు తక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని  న్యాయ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.  

మరిన్ని వార్తలు