ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు

28 Sep, 2019 15:12 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై దాఖలైన వ్యాజ్యాలను విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, ఆక్టోబర్‌ 1 నుంచి ఆయా పిటిషన్లపై విచారణను ప్రారంభించనుంది. 

మరిన్ని వార్తలు