జైశంకర్ బాధ్యతల స్వీకరణ

30 Jan, 2015 03:29 IST|Sakshi
జైశంకర్ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ: భారత విదేశాంగ కొత్త కార్యదర్శిగా ఎస్.జైశంకర్ గురువారం ఢిల్లీలో సౌత్ బ్లాక్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను నిర్వహించాల్సింది చాలా పెద్ద బాధ్యత అని, దీన్ని తనకు అప్పగించటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.
 
 ముందుగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది: సుష్మా
 సుజాతాసింగ్‌ను పదవి నుంచి ఆకస్మికంగా, అర్థాంతరంగా తొలగించటాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ సమర్థించారు. జైశంకర్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉందని, ఆ తేదీకన్నా ముందుగా ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ తాము ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందన్నారు. సుజాతాసింగ్ తొలగింపులో రాజకీయ ఉద్దేశమేమీ లేదన్నారు.

మరిన్ని వార్తలు