న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో నగదురహిత లావాదేవీల కోసం పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) స్వైపింగ్ మెషీన్లను ఏర్పాటుచేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. పార్సిల్ బుకింగ్ కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటుచేయనున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా సీజనల్, నెలవారీ టికెట్ల కొనుగోలు కోసం సబర్బన్ రైల్వేస్టేషన్లలోనూ ఈ సదుపాయం కల్పించనున్నారు. దేశంల13,000 రిజర్వేషన్, 14,000 అన్ రిజర్వ్ రైల్వే టికెట్ కౌంటర్లు ఉన్నాయి. తొలి విడతలో రిజర్వేషన్ కౌంటర్లలో పీవోఎస్ల కోసం బ్యాంకులకు లేఖ రాశామని రైల్వే తెలిపింది.