విద్యార్థులకు శుభవార్త

23 Oct, 2019 07:36 IST|Sakshi

తమిళనాడు, టీ.నగర్‌: రాష్ట్రంలో పది, ప్లస్‌ వన్, ప్లస్‌టూ విద్యార్థులకు పరీక్షా సమయాన్ని 2.30 గంటల నుంచి 3 గంటలకు పెంచుతూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలు రాసే సమయంలో సమయం సరిపోక అవస్థలు పడుతూ వచ్చారు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ పరీక్షా సమయాన్ని అరగంట పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు