బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్

4 Feb, 2016 10:45 IST|Sakshi
బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్

బెంగళూరు: టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హెసరగట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో కూర్చున్న టాంజానియా యువతిపై స్థానికులు అవమానకరరీతిలో దాడి చేశారు.

దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాంజానియా హై కమిషనర్ జాన్ కిజాజీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. టాంజానియా యువతిపై దాడి చేయడాన్ని అవమానకర ఘటనగా విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

మరిన్ని వార్తలు