టీడీపీ, కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు

6 May, 2015 10:47 IST|Sakshi

న్యూఢిల్లీ:  పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ  పార్లమెంటరీ కమిటీ  సమావేశాలు  నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.   వివిధ అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగనున్న  తరుణంలో తమ పార్టీ వైఖరిపై  సభ్యులతో చర్చించేందుకు కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా  పెండింగ్ ప్రాజెక్టులు,  రాష్ట్రానికి నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది.


మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటరీ కమిటీ కూడా భేటీ అయింది.   పార్టీ ఎంపీలతో  జరిగే ఈ భేటీలో  పార్లమెంట్ లో  చర్చ  సందర్భంగా  తమ పార్టీ వ్యూహం, ఎత్తుగడలపై  చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు