న్యూయార్క్ : విద్యార్థులకు మంచిమాటలు చెప్పి.. వారిని ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన పంతులమ్మ ఆ వృత్తికే తీరని కళంకం తెచ్చేలా వ్యవహరించారు. అమాయక విద్యార్థులకు మాయమాటలు చెప్పి.. తన శారీరక వాంఛలను తీర్చుకునేందుకు వారిని ఉపయోగించుకుంది. ఇలా ఒకరుకాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ఐదారుమంది విద్యార్థులతో రోజూ శృంగారం చేసేది ఆ టీచరమ్మ. ఆమె లీలలు తాజాగా బయటకు పొక్కడంతో.. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
అమెరికాలోని ఆర్కాన్సాస్ రాష్ట్రంలో మార్క్డ్ ట్రీ హైస్కూల్లో జెస్సీ లారెన్స్ ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. పాతికేళ్ల జెస్సీకి ఇదివరకే వివాహం అయింది. అయితే ఆమెలో శృంగార కోరికలు అధికంగా ఉండడంతో వాటిని తీర్చుకునేందుకు విద్యార్థులను వాడుకుంది. బలిష్టంగా, అందంగా ఉండే విద్యార్థులను ఎంచుకుని.. వారిని నయానో భయానో లొవగదీసుకుని తన కోర్కెలు తీర్చుకునేది. ఇలా ఈ ఏడాది నలుగురు విద్యార్థులతో శృంగార కార్యకలాపాలు నిర్వహించేది. తాజాగా ఒకేరోజు ఇద్దరు విద్యార్థులను తానుండే ఫ్లాట్కు తీసుకెళ్లి.. వారితో శృంగారం జరిపే సమయంలో.. భర్త రావడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై అర్కాన్సాస్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.