బాలికపై గ్యాంగ్ రేప్, హత్య

24 Aug, 2014 03:10 IST|Sakshi

భువనేశ్వర్: ఒడిశాలోని గంజాం జిల్లాలో మరో బాలిక కామాంధుల అకృత్యానికి బలైంది. బాలిసాహి గ్రామానికి చెందిన ఓ బాలిక(17) గురువారం తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి ఒంటరిగా వస్తుండగా ఆమెను మామిడి తోటలోకి లాక్కెళ్లిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత బాలిక శవంపై పెద్దపెద్ద బండరాళ్లు వేసి పైశాచికత్వాన్ని చాటుకున్నారు. బాలిక హత్యకు ముందు సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైందని, ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు