తెలంగాణపై నిర్ణయమే తరువాయి: దిగ్విజయ్

13 Jul, 2013 16:06 IST|Sakshi
తెలంగాణపై నిర్ణయమే తరువాయి: దిగ్విజయ్

న్యూఢిల్లీ : తెలంగాణపై ఇక సంప్రదింపులు ఉండవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటించటమే మిగిలి ఉందని ఆయన శనివారం తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ నెలఖరులోగా సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో, నేతలతో కాంగ్రెస్ ఇప్పటికే అత్యంత విస్తృతంగా సంప్రదింపులు జరిపామని, ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ నిన్న కోర్ కమిటీ భేటీ అనంతరం వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు జనార్థన్ ద్వివేదీ కూడా తెలంగాణ అంశంపై స్పందించారు. పార్లమెంటు సమావేశాలకు ముందే పార్టీకి సబంధించి ఒకటి రెండు ఉన్నతస్థాయి సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ఈ రెండు సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు