ప్రాణహితకు త్వరగా జాతీయ హోదా

24 Dec, 2014 06:48 IST|Sakshi

కేంద్ర జలసంఘం చైర్మన్‌కు టీఆర్ ఎస్ ఎంపీల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరితగతిన జాతీయ హోదా మంజూరు చేయాలని కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాను టీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ లు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, బీ.బీ. పాటిల్, జి.నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చీఫ్ ఇంజ నీర్ హరిరామ్, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు మంగళవారం ఇక్కడ పాండ్యాతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ చైర్మన్ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు త్వరలో మంజూరు చేస్తామన్నారని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు